పుట్టింటికి వచ్చి శవమైంది ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా లో వివాహిత అదృశ్యం కేసు సస్పెన్ష్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం సోమయాజులపల్లెకు చెందిన వెంకట బార్గవికి రెండు నెలల క్రితం పులివెందులకు చెందిన వ్యక్తితో పెళ్లయింది. ఆషాఢమాసం కావడంతో అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చిన భార్గవి షాపింగ్ కోసం మైదుకూరు వెళ్తున్నానంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఆ తర్వాతి రోజు కూడా ఆమె ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా గ్రామ శివారులో ఆమె మృతదేహం లభ్యమైంది. డెడ్ బాడీ పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో జరిగినది హత్య లేక ఆత్మహత్య అనేది పోలీసులు తేల్చలేకపోతున్నారు. అయితే చివరి సారిగా భార్గవి తన గ్రామానికే చెందిన బొందల గోపాల్ అనే వ్యక్తితో మాట్లాడినట్లు ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా తెలుసుకున్నారు. గోపాల్, భార్గవి కలిసి బైక్ పై ఎద్దుమడుగు కొండ ప్రాంతానికి వెళ్లి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఆమె చనిపోవడంతో పోలీసులు హత్యగా భావిస్తున్నారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లికి ముందు భార్గవికి, గోపాల్ కు మధ్య ఏమైనా ప్రేమ వ్యవహారం గానీ, ఇతర సంబంధాలు గానీ ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. భార్గవి ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ వంటివాటిని విశ్లేషిస్తున్నారు. ఆమెను బైక్ పై తీసుకెళ్లిన గోపాల్ ఆచూకీ లభ్యమైతే కేసు మిస్టరీ వీడే అవకాశముంది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే పూర్తి వివరాలు చెప్తామని పోలీసులంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)