ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు

Telugu Lo Computer
0


ఎన్డీయే రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి ద్రౌపది ముర్ము పార్లమెంట్ భవనంలో ప్రధాని మోడీ, కేంద్ర కేబినెట్ మంత్రులు ,బిజెపి, ఎన్ డిఏ పాలిత రాష్ట్రాల సీఎంల సమక్షంలో రాష్ట్రపతి పదవికి తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌కు ముందు, ముర్ము పార్లమెంటులోని మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బిర్సా ముండా విగ్రహాలకు నివాళులు అర్పించారు. అభ్యర్థులకు మద్దతివ్వడంపై నిర్ణయం తీసుకోవడానికి జార్ఖండ్ ముక్తి మోర్చా రేపు తన శాసనసభ్యులు, ఎంపీల సమావేశాన్ని పిలిచింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)