షిండేపై శివసేన కార్యకర్తల ఆగ్రహం

Telugu Lo Computer
0


మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి కారణమైన శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండేపై ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నాసిక్‌లో షిండేకు మద్దతుగా ఏర్పాటు చేసిన పోస్టర్‌పై సేన కార్యకర్తలు ఇంకు చల్లడంతోపాటు గుడ్లు విసిరారు. షిండేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అస్సాం రాజధాని గౌహతిలోని హోటల్‌లో షిండేతో పాటు మకాం వేసిన రెబెల్‌ ఎమ్మెల్యేలపైనా శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిమ్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే సదా సర్వాంకర్‌ పోస్టర్‌పై సేన కార్యకర్తలు గురువారం సిరా పూశారు. అతడు మోసగాడని నియోజకవర్గం కార్యాలయంలోని ఆయన ఫొటోపై రాశారు. శివసేన మహిళా కార్యకర్తలు ఔరంగాబాద్‌లోభారీ ర్యాలీ నిర్వహించారు. 'రెబెల్‌ ఎమ్మెల్యేలు ఓటర్ల నమ్మకాన్ని అమ్ముకునే మోసగాళ్లు' అని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే బుధవారం ప్రజలనుద్దేశించి చేసిన ఉద్వేగ ప్రసంగం అనంతరం తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండేతోపాటు ఆయనకు మద్దతిచ్చిన రెబెల్‌ ఎమ్మెల్యేలపై శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)