ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన శ్రీలంక పైలట్లు !

Telugu Lo Computer
0


శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూఎల్-504 విమానం ఈ నెల 13న లండన్ నుంచి 275 మంది ప్రయాణికులతో కొలంబో బయలుదేరింది. విమానం టర్కీ గగనతలం పైనుంచి 33 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో విమానాన్ని 35 వేల అడుగులకు తీసుకెళ్లాలని అంకారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి పైలట్లకు ఆదేశాలు అందాయి. అదే ఎత్తులో మరో విమానం వస్తోందని, కేవలం 15 మైళ్ల దూరంలోనే ఉందని శ్రీలంక పైలట్లు గుర్తించారు. వెంటనే వారు ఆ విషయాన్ని ఏటీసీ దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఏటీసీ వ్యవస్థ మాత్రం పైకి ఎగరడానికి రెండు సార్లు క్లియరెన్స్‌ ఇచ్చింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్లు 35 వేల అడుగుల ఎత్తుకు విమానాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించారు. పొరపాటును గుర్తించిన ఏటీసీ కేంద్రం పైకి ఎగరవద్దని, అదే ఎత్తులో దుబాయ్‌కు వెళ్తున్న బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం 250 మంది ప్రయాణికులతో వస్తోందని సమాచారం ఇచ్చింది. ఏటీసీ వ్యవస్థ ఆదేశాల ప్రకారం పైలట్లు విమానాన్ని 35 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లి ఉంటే, రెండు విమానాలు ఢీకొని పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది. ఏటీసీ తొలుత ఇచ్చిన ఆదేశాలను పైలట్లు గుడ్డిగా పాటించి ఉంటే 525 మంది ప్రాణాలు గాలిలో కలిసి పోయి ఉండేవంటూ శ్రీలంక ఎయిర్‌లైన్స్ బుధవారం వెల్లడించింది. పైలట్లు సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందంటూ ప్రశంసించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)