'వట పూర్ణిమ వ్రతం చేసిన భర్త !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని వలూజ్‌లో భార్యాబాధిత వ్యక్తి ఆశ్రమంలో భార్యా బాధితులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారందరూ కలిసి ‘వట పూర్ణిమ వ్రతం’ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ భార్యలు తమకు ఏడేడు జన్మలు కాదని, ఏడు క్షణాలు కూడా తమకొద్దంటూ రావి చెట్టుకు పూజలు చేసి దారాలు కట్టారు. ఈ వింత పూజకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పూజ సందర్భంగా భార్యా బాధిత సంఘం వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అయిన భరత్ ఫులారి మాట్లాడుతూ కొందరు మహిళలకు రావి చెట్టును పూజించే అర్హత లేదన్నారు. తమకు అనుకూలంగా చట్టాలు ఉండడంతో కొందరు మహిళలు భర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు. భర్తల కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ ఏకపక్ష చట్టం పురుషులను స్త్రీలకు బానిసలుగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పురుషులకు కూడా సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)