దేశంలో 6,594 కరోనా కొత్త కేసులు నమోదు

Telugu Lo Computer
0


గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,21,873 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా 6,594 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,36,695 కి చేరింది. నిన్న 4,035 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,26,61,370కి చేరింది. ఇప్పటివరకు 5,24,771 మంది కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 50,548 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.76 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 2.05శాతంగా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 195.35 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)