ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా సింహగిరిపై ఉన్న సింహాచల దేవస్థానంలోని రామాలయంలో ఈ నెల 9వ తేదీన ధ్వజస్తంభాన్ని పున:ప్రతిష్టించిన సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందు ధ్వంసమైన ధ్వజస్తంభాన్ని తొలగించే పనిలో భాగంగా కూలీలు తవ్వకాలు జరిపినప్పుడు.. వారికి బంగారంతో తయారు చేసిన గరుడ మంత్రం, 112 రాగి నాణేలు, రాగితో తయారు చేసిన ధ్వజ స్తంభ నమూనా పత్రాలు లభ్యమయ్యాయి. వీటిని రెవెన్యూ అధికారులు.. పోలీసులు, దేవస్థానం సిబ్బంది సమక్షంలో అన్నీ పరిశీలించి.. అనంతరం జాగ్రత్తగా భద్రపరిచారు.
సింహాచలంలో గరుడ మంత్రం, 112 రాగి నాణేలు లభ్యం !
June 27, 2022
0
Tags