104 వాహనాల సేవలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అంబులెన్స్ సేవలను కోల్పోనున్నారు.104 వాహనాల సేవలు నిలిచిపోనుండటంతో సర్వీసుకు పనిచేస్తున్న అంబులెన్సులను త్వరలో వేలం వేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణవ్యాప్తంగా ఉన్న వాహనాలను వేలం వేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సర్కార్ ఆదేశించింది. అంబులెన్సులు అమ్మగా వచ్చిన డబ్బులను వైద్య సేవలకు ఖర్చు చేయాలని సర్కారు ఆలొచిస్తున్నారు. 104 అంబులెన్స్ సర్వీసులను 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. మారుమూల ప్రాంతాల్లో బీపీ, షుగర్, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి స్థానికంగా ట్రీట్మెంట్ అందించేందుకు ఈ అంబులెన్స్లను తీసుకువచ్చారు. ప్రభుత్వం ఈ వాహనాల్లో ఫార్మసిస్ట్, ఏఎన్ఎం, ల్యాబ్టెక్నీషియన్, మెడికల్ అసిస్టెంట్, డ్రైవర్లను నియమించింది.
తెలంగాణలో 104 వాహనాల సేవల రద్దు
June 11, 2022
0
Tags