టాటా స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రమాదాన్ని మరవకముందే జార్ఖాండ్‌లోని జంషెడ్‌పూర్ టాటా స్టీల్ ప్లాంట్‌లో శనివారం ఉదయం 10.30 గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కాంట్రాక్ట్ వర్కర్లు గాయపడ్డారు. కోక్ ప్లాంట్‌లో పేలుడు జరగడంతో ప్లాంట్ ఆవరణలో మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదని కంపెనీ అధికారులు చెప్పారు. కోక్ ప్లాంట్‌లోని బ్యాటరీ 6 వద్ద గ్యాస్ లైన్ వద్ద పేలుడు జరిగిందని, ప్రస్తుతం బ్యాటరీ 6లో ఎలాంటి ఆపరేషన్ జరగడం లేదని, డిస్మాంటలింగ్ ప్రోసెస్ జరుగుతోందని తెలిపారు. ఇదే టాటా స్టీల్ ప్లాంట్‌లో 2013 నవంబర్‌లోనూ పేలుడు జరగడంతో 11 మంది గాయపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)