మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రమాదాన్ని మరవకముందే జార్ఖాండ్లోని జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్లో శనివారం ఉదయం 10.30 గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కాంట్రాక్ట్ వర్కర్లు గాయపడ్డారు. కోక్ ప్లాంట్లో పేలుడు జరగడంతో ప్లాంట్ ఆవరణలో మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదని కంపెనీ అధికారులు చెప్పారు. కోక్ ప్లాంట్లోని బ్యాటరీ 6 వద్ద గ్యాస్ లైన్ వద్ద పేలుడు జరిగిందని, ప్రస్తుతం బ్యాటరీ 6లో ఎలాంటి ఆపరేషన్ జరగడం లేదని, డిస్మాంటలింగ్ ప్రోసెస్ జరుగుతోందని తెలిపారు. ఇదే టాటా స్టీల్ ప్లాంట్లో 2013 నవంబర్లోనూ పేలుడు జరగడంతో 11 మంది గాయపడ్డారు.
టాటా స్టీల్ ప్లాంట్లో భారీ పేలుడు
May 07, 2022
0
Tags