తమిళనాడు లోని పుదుక్కొట్టై జిల్లా, తిరుమయం సమీపంలోని మేల దూర్వాసపురానికి చెందిన పాండియన్ (37) భార్య అలగు (33) బుధవారం తన ఇంటి సమీపంలో ఉన్న కట్టెలను పేరుస్తుండగా ఓ కొండచిలువ ఆమెను కాటు వేసింది. దీంతో పరిగెత్తుకుంటూ వెళ్లి భర్త పాండియన్కు తెలిపింది. అతను ఆ కొండచిలువను పట్టుకుని గోనె సంచిలో వేసుకుని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించి తన భార్యకు చికిత్స చేయమని కోరాడు. అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని కొండచిలువ కాటు వల్ల అలగుకు ప్రమాదం ఉండదని తెలిపారు. అనంతరం కొండచిలువను అడవిలో వదిలిపెట్టారు.
కాటేసిన కొండ చిలువ !
May 20, 2022
0