చెత్త కాగితాలు ఏరుకోవడానికి పిల్లలతో చిలకలూరిపేట నుంచి గుంటూరుకు లారీలో వచ్చిందా మహిళ. గుంటూరు శివారు నాయుడుపేట వద్ద లారీ దిగి రూ.100 ఇచ్చింది మహిళ. అయితే తనకు రూ.100 సరిపోవని, రూ.300 ఇవ్వాలని మహిళను డిమాండ్ చేశాడు లారీ డ్రైవర్. తన దగ్గర అంత డబ్బు లేదనడంతో.. పిల్లలను దించకముందే లారీ ముందుకు నడిపించేశాడు డ్రైవర్. దీంతో పిల్లల కోసం లారీని పట్టుకుని వేలాడుతూ కొంతదూరం వెళ్లిపోయింది మహిళ. కాసేపటికే అదుపు తప్పి లారీ కింద పడి మహిళ (40) మృతి చెందింది. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. తల్లి మరణంతో పిల్లలు అనాథలుగా మారారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
లారీ డ్రైవర్ కిరాతకానికి మహిళ బలి !
May 20, 2022
0
Tags