పాక్ భూభాగం నుంచి సొరంగం జమ్మూ కాశ్మీర్ లోకి సొరంగం

Telugu Lo Computer
0


జమ్మూకశ్మీర్ లోని సాంబా దగ్గర సరిహద్దుల్లోని ఫెన్సింగ్ సమీపంలో సొరంగం అధికారులు గుర్తించారు. పాక్ భూభాగం నుంచి సొరంగం ఉండటంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన తర్వాత సొరంగాన్ని గుర్తించామన్నారు. పాకిస్థాన్​ సరిహద్దుకు అత్యంత సమీపంలోనే ఉన్న కారణంగా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇటీవల ఇద్దరు జైషే మహ్మద్​ సూసైడ్​ బాంబర్లు  ఈ సొరంగం గుండానే భారత్​లోకి చొరబడినట్లు అధికారులు భావిస్తున్నారు. పాక్​ నుంచి సొరంగం దాదాపు 150 మీటర్ల పొడవు ఉంటుందని అంచనా వేస్తున్నారు. జమ్ముకశ్మీర్​ సాంబాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ సొరంగాన్ని గుర్తించింది సరిహద్దు భద్రతా దళం (బీఎస్​ఎఫ్​).  అమర్​నాథ్​ యాత్రకు అంతరాయం కలిగించేందుకు పాక్​ ముష్కరుల కుట్రలో భాగంగానే సొరంగం తవ్వారని భావిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)