జమ్మూకశ్మీర్ లోని సాంబా దగ్గర సరిహద్దుల్లోని ఫెన్సింగ్ సమీపంలో సొరంగం అధికారులు గుర్తించారు. పాక్ భూభాగం నుంచి సొరంగం ఉండటంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన తర్వాత సొరంగాన్ని గుర్తించామన్నారు. పాకిస్థాన్ సరిహద్దుకు అత్యంత సమీపంలోనే ఉన్న కారణంగా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇటీవల ఇద్దరు జైషే మహ్మద్ సూసైడ్ బాంబర్లు ఈ సొరంగం గుండానే భారత్లోకి చొరబడినట్లు అధికారులు భావిస్తున్నారు. పాక్ నుంచి సొరంగం దాదాపు 150 మీటర్ల పొడవు ఉంటుందని అంచనా వేస్తున్నారు. జమ్ముకశ్మీర్ సాంబాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ సొరంగాన్ని గుర్తించింది సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్). అమర్నాథ్ యాత్రకు అంతరాయం కలిగించేందుకు పాక్ ముష్కరుల కుట్రలో భాగంగానే సొరంగం తవ్వారని భావిస్తున్నారు.
పాక్ భూభాగం నుంచి సొరంగం జమ్మూ కాశ్మీర్ లోకి సొరంగం
May 05, 2022
0
Tags