జిగ్నేశ్ మేవానీకి 3 నెలల జైలు శిక్ష

Telugu Lo Computer
0


గుజరాత్‌లోని ఓ కోర్టు జిగ్నేశ్‌కు 3 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తూ తీర్పు ఇచ్చింది. 2017లో నమోదైన ఈ కేసు విచారణను ముగించిన కోర్టు జిగ్నేష్ సహా ఆయన 12 మంది అనుచరులకూ ఈ శిక్షలు ఖరారు చేసింది. ఆజాదీ కూచ్ పేరితో 2017లో తన అనుచరులతో కలిసి జిగ్నేశ్ ఓ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గుజరాత్‌లోని మెహసానా నుంచి బనస్కంత జిల్లాలోని ధనేరా వరకు సాగింది. ఈ ఘటనపై అప్పుడే పోలీసులు కేసులు నమోదు చేయగా. తాజాగా ఈ కేసులో జిగ్నేశ్‌కు జైలు శిక్ష విధిస్తూ కోర్టు విచారణను ముగించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)