మహారాష్ట్రలోని దాదర్, మతుంగాల మధ్య ఒకే ట్రాక్పై ఛేంజింగ్ సమయంలో రెండు రైళ్లు ఒకదానికొకటి గుద్దుకున్నాయి. గదగ్ ఎక్స్ప్రెస్, పుదుచేరి ఎక్స్ప్రెస్లు ట్రాక్ ఎక్స్చేంజ్ సమయంలో ఒకదానికొకటి ఎదురెదురై ఢీ కొన్నాయి. ఈ ఘటన దాదర్, మతుంగా రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. రెండు రైళ్లు ఢీ కొనడంతో హెడ్ వైర్ తెగిపోయి. భారీ పేలుడు శబ్దం విన్పించింది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు రైళ్లు తక్కువ వేగంతో ఉన్నాయి. రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొట్టడంతో కొన్ని కోచ్లు పట్టాలు తప్పాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఈ రైలు ప్రమాదం నిన్న అంటే శుక్రవారం రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదం మటుంగా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగినట్టు రైల్వే అధికారుల వెల్లడించారు. ఈ ప్రమాదం కారణంగా స్థానిక రైళ్ల రాకపోకలపై ప్రభావం పడుతోంది.
ఒకే ట్రాక్పై రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీ
April 16, 2022
0
Tags