బెంగళూరు గీతం క్యాంపస్‌లో ఉగాండా విద్యార్థిని మృతి

Telugu Lo Computer
0


కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలోని గీతం క్యాంపస్‌లో ఉగాండా దేశానికి చెందిన విద్యార్థిని మృతి చెందింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందని భావించిన తోటి విద్యార్థులు ఆందోళనకు దిగి, యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్యాంపస్‌లో పోలీసులు భారీగా మోహరించారు. ఉగాండాకు చెందిన హసీనా (24) గీతం యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతోంది. అయితే ఆరో అంతస్తుపై ఉన్న బట్టలను తీసుకువచ్చేందుకు హసీనా యత్నించగా, ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బుధవారం రాత్రి 11 గంటల సమయంలో చోటు చేసుకుంది. అయితే హసీనా ఆత్మహత్య చేసుకుందనే వార్తలు క్యాంపస్‌లో గుప్పుమన్నాయి. దీంతో తోటి విద్యార్థులందరూ ఆందోళనకు దిగారు. కాలేజీ, హాస్టల్ బిల్డింగ్ కిటీకీలను, మంచాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో క్యాంపస్‌లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు క్యాంపస్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)