ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమోట్ చేసే దిశగా ఢిల్లీ గవర్నమెంట్ భారీ ఆఫర్లు ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా ఈ-సైకిళ్లకు కూడా సబ్సిడీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ముందుగా కొనుగోలు చేసిన 10వేల మంది కస్టమర్లకు రూ.5వేల 500 చొప్పున చెల్లించనున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా ముందుగా కొనుగోలు చేసిన 1000మంది కొనుగోలుదారులకు ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ అదనంగా రూ.2వేలు సబ్సిడీ దక్కుతుందని ఢిల్లీ రవాణా మంత్రి కైలాశ్ గెహ్లాట్ చెప్పారు. దేశంలోనే ఈ-సైకిల్ కి రాయితీలు అందించే తొలి రాష్ట్రంగా ఢిల్లీ కి ఆ ఘనత దక్కింది. భారీ కార్గో ఈ-సైకిళ్లు, వాణిజ్య అవసరాల కోసం ఇ-కార్ట్ల కొనుగోలుపై రాయితీని కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా మంత్రి తెలిపారు. ఈ ప్రకటనపై హీరో లెక్ట్రో సీఈవో ఆదిత్య ముంజాల్ స్పందిస్తూ, ఈవీ సబ్సిడీ విధానంలో ఈ-సైకిళ్లను చేర్చాలనే ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ విషయమని అన్నారు.
Post Top Ad
adg
Friday, 8 April 2022
Home
business
Electric vehicle
ఎలక్ట్రిక్ సైకిళ్లను EV పాలసీ పరిధిలోకి తీసుకురావాలి
సైకిళ్లకు ఢిల్లీ సర్కార్ సబ్సిడీ
సైకిళ్లకు ఢిల్లీ సర్కార్ సబ్సిడీ !
సైకిళ్లకు ఢిల్లీ సర్కార్ సబ్సిడీ !
Tags
# business
# Electric vehicle
# ఎలక్ట్రిక్ సైకిళ్లను EV పాలసీ పరిధిలోకి తీసుకురావాలి
# సైకిళ్లకు ఢిల్లీ సర్కార్ సబ్సిడీ
About Telugu Post
సైకిళ్లకు ఢిల్లీ సర్కార్ సబ్సిడీ
Tags
business,
Electric vehicle,
ఎలక్ట్రిక్ సైకిళ్లను EV పాలసీ పరిధిలోకి తీసుకురావాలి,
సైకిళ్లకు ఢిల్లీ సర్కార్ సబ్సిడీ
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment