మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కమల్ నాథ్ రాజీనామా చేశారు. కమల్ నాథ్ రాజీనామాను కాంగ్రెస్ ఆమోదించింది. కమల్ నాథ్ రాజీనామా తర్వాత డాక్టర్ గోవింద్ సింగ్ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా బాధ్యతలు స్వీకరిస్తారని కాంగ్రెస్ వెల్లడించింది. 2018లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత దాదాపు 15 నెలల పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్ నాథ్ పనిచేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సిట్టింగ్ ఎమ్మెల్యేల రాజీనామాల కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ గందరగోళంతో మార్చి 2020లో పడిపోయింది. ఆ తర్వాత జూలై 2020లో కమల్ నాథ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ పదవిని చేపట్టారు.
కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీకి కమల్ నాథ్ రాజీనామా
April 28, 2022
0
Tags