పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

Telugu Lo Computer
0


పంజాబ్‌లో ఆదివారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రూప్‌నగర్ వద్ద రైలు పట్టాలపైకి పశువుల మంద రావడంతో లోకో పైలట్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో 16 బోగీలు పట్టాలు తప్పాయి. రోపర్‌ థర్మల్‌ ప్లాంట్‌ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. దీంతో రూప్‌నగర్‌ మార్గంలో పలు ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు రద్దుచేశామన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది పట్టాలు తప్పిన బోగీలను తొలగిస్తున్నారు. వ్యాగన్లు ఒకదానిపై ఒకటి పడిపోయవడంతో ఈ ప్రక్రియ కొద్దిగా ఆలస్యంగా నడుస్తున్నది. దీంతో సోమవారం సాయంత్రం వరకు ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)