మంత్రుల పేషీల్లో పని చేస్తోన్న ఓఎస్డీలను పీఎస్, అడిషనల్ పీఎస్సులను మాతృ సంస్థల్లోకి వెళ్లాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తిరిగి మంత్రుల పేషీల్లోకి రావాలంటే మాతృ శాఖ నుంచి మళ్లీ అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. జిల్లాల విభజన తర్వాత పేషీల్లోని చాలా మంది గ్రూప్-1 అధికారులకు ప్రమోషన్లు ఇచ్చింది. ప్రమోషన్లు రావడంతో మాతృశాఖకు పంపింది. తిరిగి పేషీల్లోకి రావాలంటే మంత్రుల అనుమతి తప్పనిసరి ప్రభుత్వం అంటోంది. ఇందులో భాగంగానే… మంత్రుల పేషీల్లోని అధికారులకు.. సిబ్బందికి జీఏడీ నుంచి ఫోన్లు వెళ్లాయి. పేషీల్లోని అధికారులు, సిబ్బంది వివరాలను జీఏడీ సేకరిస్తోంది. త్వరలోనే ఈ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.
మంత్రుల పేషీల్లోని గ్రూప్-1 ఆఫీసర్లకు షాక్ !
April 07, 2022
0
Tags