మహిళల వన్డే ప్రపంచకప్లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయాల తర్వాత బంగ్లాదేశ్పై 110 పరుగుల భారీ తేడాతో విజయాన్నందుకుంది. దీనితో మిథాలీ సేన సెమీస్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఈ భారీ విజయంతో రన్రేట్ మెరుగుపరుచుకున్న భారత జట్టు పాయింట్స్ టేబుల్లో 6 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇక లీగ్ లో చివరి మ్యాచ్ను మార్చి 27న సౌతాఫ్రికాతో ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ నేరుగా సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకొంటుంది.
బంగ్లాపై భారత్ ఘన విజయం
March 22, 2022
0