పవన్ ముంజాల్ ఇంటిపై ఐటీ దాడులు

Telugu Lo Computer
0


హీరో మోటాకార్ప్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ పవన్ ముంజాల్ ఇంటిపై తెల్లవారు జామునుంచి ఐటీశాఖ సోదాలు జరిపింది. గురుగ్రామ్‌లోని ముంజాల్‌ ఇంటితో పాటు హీరో సంస్థలోని ఉన్నత స్థాయి అధికారుల ఇళ్లల్లో కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించారని సమాచారం. ఐటీ దాడులకు సంబంధించి హీరో కంపెనీ కానీ, ఆదాయపు పన్ను శాఖ కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం విడుదల చేయలేదు. హీరో మోటాకార్ప్ ప్రపంచ అతిపెద్ద టూవీలర్ మ్యాన్యుఫ్యాక్చరర్ గా 2001 నుంచే ఎదిగింది. ఒక క్యాలెండర్ ఇయర్ లో ఎక్కువ వాహనాలను అమ్మిన కంపెనీగా నిలిచింది.  ఇప్పటి వరకూ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ మార్కెట్లలో హీరో మోటోకార్ప్‌ 100 మిలియన్ యూనిట్లకు పైగా అమ్మకాలు జరిపింది. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, మధ్య అమెరికాలోని 40 దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)