కోడి గుడ్డు కూర వండలేదని ఆత్మహత్య!

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్రం లోని మెదక్ జిల్లా మనోహరాబాద్‌ మండలంలోని రంగాయపల్లిలో మంగళవారం రాత్రి భోజనంలోకి కోడి గుడ్డు కూర చేయలేదని తల్లిపై కోపంతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన మస్కూరి నర్సింలు, సుశీల దంపతులకు ఇద్దరు కొడుకులు. అందులో చిన్న కొడుకు మములేశ్‌ (19) ఇటీవల రోడ్డు ప్రమాదం బారిన పడగా భుజానికి గాయమైంది. దీంతో కొన్ని రోజులుగా ఏ పనీ చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మములేశ్‌ తల్లి సుశీలను కోడిగుడ్డు కూర వండాలని కోరాడు. ఇంట్లో గుడ్లు లేవని ఇప్పుడు వండలేనని అమె చెప్పడంతో తల్లితో కొట్లాట పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గ్రామంలో అన్ని చోట్లా వెదికినా ఆచూకీ దొరకలేదు. బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని మహంకాళి దేవాలయం దగ్గర పొలంలో చెట్టుకు కరెంటు తీగతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ మేరకు తండ్రి నర్సింలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు మనోహరాబాద్‌ ఎస్‌ఐ రాజుగౌడ్‌ చెప్పారు.


Post a Comment

0Comments

Post a Comment (0)