సోనూ సూద్ సోదరి పరాజయం

Telugu Lo Computer
0


పంజాబ్ రాష్ట్రంలో ఆప్ దెబ్బకు బడా బడా నేతలు పరాజయం పాలవుతున్నారు. చిన్న అభ్యర్థుల చేతుల్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సైతం ఓటమి చెందుతున్నారు. మొత్తం 117 సీట్లున్న పంజాబ్ లో ఆప్ ఏకంగా 91 స్థానాల్లో అధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్ కేవలం 19 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. పరాజయం చెందిన వారిలో ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ కూడా ఉన్నారు. మోగా నియోజకవర్గం నుంచి ఈమె ఎన్నికల బరిలో ఉన్నారు. ఆప్ అభ్యర్థి డాక్టర్ అమన్ దీప్ కౌర్ అరోరా చేతిలో పరాజయం చెందారు. ఏకంగా 58 వేల 813 ఓట్ల తేడాతో అమన్ దీప్ గెలుపొందారు.

Post a Comment

0Comments

Post a Comment (0)