తమిళనాడు లోని వండలూరు జూలో జన్మించిన ఆకాంక్ష అనే ఓ ఆడ తెల్లపులి కన్ను మూసింది. రెండు వారాలుగా 'అటాక్సియా' అనే కండరాల సమస్యతో బాధపడుతోంది. ఈ పులికి వెటర్నరీ వైద్యులు చికిత్స అందిస్తున్నా ఫలితం లేకపోయింది. రెండు రోజుల నుంచి ఆ పులి కనీసం ఆహారం కూడా తీసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి 12 గంటల సమయంలో ఆ పులి చనిపోయినట్లు జూ అధికారులు తెలిపారు. పులి కళేబరానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.
తమిళనాడు జూలో తెల్ల ఆడపులి మృతి
March 25, 2022
0