దేశంలో 1,685 కొత్త కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య నిన్నటి మీద స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 1,685 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో 83 మంది కోవిడ్ తదితర కారణాలతో కన్నుమూశారు. ప్రస్తుతం 21,350 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,30,16,372 కోవిడ్ కేసులు నమోదు కాగా వారిలో 5,16,755 మంది కోవిడ్ కారణంతో కన్ను మూశారు.  కోవిడ్ నుండి 2,499 మంది కోలుకున్నారు. కోవిడ్ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.05 శాతంగా ఉంది. ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,24,78,087కు చేరింది. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 182.55,75,126 టీకాలు వేశారు. నిన్న 29,82. 451 డోసులు టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)