దేశంలో 1,660 కరోనా కొత్త కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో 6,58,489 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా 1,660 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.దీంతోకరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,18,032కి చేరింది. నిన్న 4100 మంది మరణించారు. మహారాష్ట్ర (4,007), కేరళలో(81) మరణాల సంఖ్యను సవరించడంతో భారీ స్థాయిలో తేడా కనిపించింది. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 5,20,855కి చేరింది. 2,349 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,24,80,436కి చేరింది. ప్రస్తుతం దేశంలో 16,741 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.75, రోజువారి పాజిటివిటీ రేటు కూడా 0.25 శాతంగా నమోదు అయింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 29.07 లక్షల మందికి టీకా వేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)