దేశంలో 1,233 కొత్త కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో తాజాగా 6.24 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా1,233 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు దిగువకు, పాజిటివిటీ రేటు 0.03 శాతం నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 31 మంది మరణించారు. నిన్న 1,876 మంది కోలుకోగా రికవరీ రేటు 98.75 శాతానికి పెరిగింది. తాజాగా క్రియాశీల కేసులు 15 వేల దిగువకు చేరాయి. దాంతో క్రియాశీల రేటు 0.03 శాతానికి క్షీణించింది. ఇప్పటి వరకు దేశంలో 4.30 కోట్ల కరోనా కేసులు రాగా.. 5.21లక్షల మంది మరణించారు. ఈ వైరస్ వ్యాప్తి కట్టడికి కేంద్రం మొదలు పెట్టిన టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. దాని కింద 183 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 26.34 లక్షల మంది టీకా తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)