తమిళనాడులోని వేలూరు జిల్లా కాట్పాడీలో వినాయకం అనే వ్యక్ నాలుగేళ్ళ క్రితం సుప్రజ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. వినాయకం మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. విషయం తెలుసుకున్న భార్య సుప్రజ భర్తతో తరచుగా గొడవ పడేది. అయితే భార్య అడ్డు తొలగించుకోడానికి వినాయకం పథకం వేశాడు. భార్యను మాయమాటలతో నమ్మించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. తన తమ్ముడు విజయ్, స్నేహితుడు శివ సహాయంతో సమీపంలోని అటవీ ప్రాంతంలో బతికి ఉండగానే భార్యను పూడ్చి పెట్టాడు. అనంతరం సుప్రజ కనిపించలేదంటూ తానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుప్రజ తల్లిదండ్రులు వినాయకంపై ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం బట్టబయలు అయింది. కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టిన పోలీసులు వినాయకంతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అటవీప్రాంతంలో పూడ్చిన పెట్టిన సుప్రజ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బతికున్న భార్యను పూడ్చి పెట్టిన భర్త !
March 30, 2022
0
Tags