టీ తాగుతూ ఏకంగా​ గ్లాస్​ మింగేశాడు!

Telugu Lo Computer
0


బీహార్​లోని ముజఫర్​పుర్​ జిల్లాలో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓ 55 ఏండ్ల వ్యక్తిని పరిశీలించిన డాక్టర్లకి ఆశ్చర్యకర విషయం తెలిసింది. అతని కడుపులో గ్లాసు ఉందని గుర్తించారు. అనంతరం ఆపరేషన్ చేసి తొలగించారు. తీవ్ర కడుపు నొప్పితో జిల్లాలోని మడిపుర్ ప్రాంతంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు ఓ 55ఏళ్ల వ్యక్తి. వెంటనే డాక్టర్లు అతనికి ఎక్స్​-రే తీశారు. బాధితుడి కడుపులో గ్లాసు ఉన్నట్లుగా గుర్తించారు. కడుపులో గ్లాసు ఉండడం చూసి డాక్టర్లు బాధితుడిని ప్రశ్నించారు. దాంతో టీ తాగేటప్పుడు గ్లాస్‌ను మింగేశానని చెప్పాడు. తొలుత ఎండోస్కోప్ చేసి గ్లాస్‌ను తొలగించడానికి డాక్టర్లు ప్రయత్నించారు. కానీ అది సాధ్యపడలేదు. దీంతో చివరగా ఆపరేషన్​​ చేయాల్సి వచ్చింది. టీ తాగుతుండగా గ్లాస్‌ను మింగేసినట్టు చెప్పిన రోగి మాటలు నమ్మశక్యంగా లేదని అంటున్నారు డాక్టర్లు. సన్నగా ఉండే ఆహార నాళంలో గ్లాసు పట్టే అవకాశం లేదని అంటున్నారు.​ అతడి ఆరోగ్యం ఇప్పడు నిలకడగానే ఉందని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)