దేశంలో 25,920 కొత్త కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో  25,920 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే కరోనా కేసుల సంఖ్య 4,837 కేసులు తగ్గాయి. నిన్న 492 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ  హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. పాజిటివిటీ రేటు 2.07 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో 2,92,092 కేసులు యాక్టివ్‌గా  ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం దేశంలో మహమ్మారి కేసుల 4,27,80,235 కి చేరగా.. ఇప్పటివరకు కరోనా నుంచి 5,10,905 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తెలిపింది. నిన్న కరోనా మహమ్మారి నుంచి 66,254 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,19,77,238 కి పెరిగింది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,74,64,99,461 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)