దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు తీపి కబురు అందించింది. రికరింగ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్లో ప్రతి నెలా డబ్బులు దాచుకునే వారికి ప్రయోజనం కలుగనుంది. అధిక రాబడి లభించనుంది. ఇది ఫిబ్రవరి 15 నుంచే అమలులోకి వచ్చింది. రూ.100 కనీస డిపాజిట్ మొత్తంతో ఎస్బీఐలో ఆర్డీ అకౌంట్ తెరవొచ్చు.రికరింగ్ డిపాజిట్ అకౌంట్ను ఏడాది నుంచి 10 ఏళ్ల కాల పరిమితితో ఓపెన్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన టెన్యూర్ ఎంచుకోవచ్చు. మీరు ఎంచుకున్న టెన్యూర్ వరకు ప్రతి నెలా డబ్బులు కడుతూ వెళ్లాలి. ఏడాది నుంచి రెండేళ్ల కాల పరిమితిలోని ఆర్డీ ఖాతాలపై 5.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు ఆర్డీలపై 5.2 శాతం వడ్డీ పొందొచ్చు. మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు రికరింగ్ డిపాజిట్లపై 5.45 శాతం వడ్డీ వస్తుంది. ఐదేళ్ల నుంచి పదేళ్లలోపు ఆర్డీలపై 5.5 శాతం వడ్డీని సొంతం చేసుకోవచ్చు. ఎస్బీఐ 2 ఏళ్లకు పైన కాల పరిమితిలోని ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 నుంచి 15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు ఎఫ్డీలపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీంతో ఈ ఎఫ్డీలపై ఇకపై 5.2 శాతం వడ్డీ లభిస్తుంది.అదే మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లను గమనిస్తే.. వడ్డీ రేటు 15 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. దీంతో ఈ ఎఫ్డీలపై ఇకపై 5.45 శాతం వడ్డీ పొందొచ్చు. అలాగే ఐదేళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఎఫ్డీలపై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్ల మేర పైకి కదిలింది. దీంతో ఈ ఎఫ్డీలపై వడ్డీ రేటు 5.5 శాతానికి చేరింది. ఈ కొత్త వడ్డీ రేట్లు రూ. 2 కోట్లలోపు ఎఫ్డీలకు మాత్రమే వర్తిస్తాయి.
రికరింగ్ డిపాజిట్లపై ఎస్బీఐ వడ్డీ రేట్ల పెంపు
February 18, 2022
0