సింహగిరిని కప్పేసిన మంచు దుప్పటి !

Telugu Lo Computer
0

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం జిల్లా సింహాచలం సింహగిరిని నేడు మంచు దుప్పటి కప్పేసింది. ఆ దృశ్యాలను చూసిన భక్తులు లంబసింగి ప్రాంతాలను తలపించేలా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. జనవరిలో మంచు ఇలా కనిపించడం విశేషం.స్వామి దర్శనానికి వచ్చే భక్తులంతా మంచు మేఘాల్లో సింహగిరులు తేలియాడటాన్ని చూసి పరవశించిపోయారు. ఈ అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణం అరకు, లంబసింగి ప్రాంతాలను తలపిస్తోందని మురిసి మైమరిచిపోయారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)