అయ్యప్ప స్వామికి వజ్రాల కిరీటం విరాళం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మారం వెంకటసుబ్బయ్య,  ఆయన కుమారుడు మారం శ్రీనివాసులు శబరిమల అయ్యప్ప స్వామికి వజ్రాల కిరీటాన్ని విరాళంగా ఇచ్చారు. వెంకటసుబ్బయ్య.. శుక్రవారం ఆలయంలో కేరళ హైకోర్టు న్యాయవాది సాయంతో కిరీటాన్ని శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడికి అందజేశారు. గతేడాది కరోనా బారిన పడిన సమయంలో తాము కోలుకోవాలని వెంకట సుబ్బయ్య మొక్కుకున్నారు. ప్రస్తుతం ఆ మొక్కులో భాగంగా కిరీటాన్ని బహూకరించారు. అయితే ఆ కిరీటం వెల ఎంత అనేది వెల్లడించలేదు. గత 30ఏళ్లుగా.. విరామం లేకుండా శబరిమల ఆలయాన్ని సందర్శిస్తున్న అయ్యప్ప భక్తుడు మారం వెంకటసుబ్బయ్య. ఇటీవల  కొవిడ్ భారీన పడటంతో ఆసుపత్రిలో చేరారు. మరణం అంచుల వరకు వెళ్లాడు. ఆ సమయంలో తాము కోలుకోవాలని అయ్యప్పకు మొక్కుకున్నారు. అనంతరం వైరస్​ నుంచి అతను కోలుకున్నారు. అయ్యప్ప భగవానుడి ఆశీర్వాదం వల్లే తాను బతకగలిగానని.. శబరిమల ఆలయానికి వజ్ర కిరీటాన్ని నైవేద్యంగా సమర్పించాలని నిర్ణయించుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)