ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

Telugu Lo Computer
0

 

విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ 6 బోగీలో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. ఆ బోగిలోని ప్రయాణకులంతా భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన రైల్వేశాఖ వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలో దాదాపు గంటపాటు రైలుని నిలిపివేశారు. రైలు బ్రేకులు జాం కావడంతో పొగలు వ్యాపించి ఉండొచ్చునని రైల్వే అధికారులు చెబుతున్నారు. రైలులో మంటలు వ్యాపించడానికి గల కారణాలపై రైల్వే అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గంటపాటు రైలు నిలిచిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రమాద ఘటనలో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడటంతో వారితో పాటు రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఏపీ ఎక్స్ ప్రెస్ రైల్లో మంటలు చెలరేగిన ఘటనకు సంబంధించి విచారణ జరిపిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)