బతికుండగానే కూతురుకు పిండం పెట్టిన తండ్రి!

Telugu Lo Computer
0


తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని చిన్న చింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన భార్గవి కి అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ సమీప బంధువులే కావడంతో తమ ప్రేమను పెద్దలకు తెలియజేశారు. తమకు పెళ్లి చేయాలని వారిని కోరారు. అయితే.. పెద్దలు అందుకు అంగీకరించలేదు. దీంతో వారు ఈ నెల 13న పెద్దలకు తెలియకుండా ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురు తమ మాట కాదని ప్రేమ వివాహాం చేసుకోవడంతో భార్గవి తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తన దృష్టిలో తన కుమారై చనిపోయిందని.. ఇక తనకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. కుమారై చనిపోయిందని గుండు గీయించుకుని ఆమె కర్మకాండలు జరిపించాడు. అంతేకాదు.. కుమారై చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్దాంజలి కూడా ఘటించాడు. కుమారై బతికుండానే ఆ తండ్రి చేసిన పని ఆ గ్రామంలోనే చర్చనీయాంశమైంది. ఇక సోషల్ మీడియాలో సైతం ఈ ఘటన వైరల్‌గా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)