పది రాష్ట్రాలకు కేంద్ర బృందాలు ?

Telugu Lo Computer
0


దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. భారత్ లో ఇప్పటికే 245 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పదిహేడు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే అతి తీవ్రంగా పది రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ఒమిక్రాన్ కేసుల నమోదు, కోవిడ్ నిబంధన అమలు వంటి వాటిపై ఈ బృందం అధ్యయనం చేస్తుంది. వ్యాక్సినేషన్ ఎంత మేరకు జరిగింది కూడా పరిశీలిస్తుంది. ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదయిన కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మిజోరాం, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ లలో ఈ బృందం పర్యటిస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)