గుంటూరు జిల్లాలో బాలిక కిడ్నాప్ యత్నం ?

Telugu Lo Computer
0



గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం జలాలపురంలో ఆదివారం ఓ బాలిక ఇంటిముందు చలికాచుకుంటోంది. ఈ క్రమంలో బైక్ పై వచ్చిన దుండగులు ఇంటి ముందు చలి కాచుకుంటున్న చందనను అపహరించే ప్రయత్నం చేశారు. దీంతో ప్రతిఘటించిన బాలికపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. బాలికతోపాటు ఆమె అన్న కేకలు వేయడంతో గుర్తుతెలియని దుండగులు పరారైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పెదకూరపాడు పోలీసులు కేసు నమాదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ యత్నం ఘటన కలకలం రేపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితులను పట్టుకునేందుకు బాధితురాలి నుంచి వివరాలు సేకరించామని పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)