కరోనా సోకిన బాలికతో వ్యభిచారం ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలానికి చెందిన 13 ఏళ్ల బాలికకు జూన్ 26వ తేదీన కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో పాఠశాల నుంచి ఇంటికి తీసుకు రాగా ఇక బాలిక నుంచి తల్లికి కూడా కరోనా వైరస్ సోకింది. దీంతో బాలిక తల్లి ఆరోగ్యం క్షీణించడంతో గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. ఈ క్రమంలోనే తల్లి ప్రేమకు దూరమైన బాలికకు గుంటూరు ద్వారకా నగర్ కు చెందిన స్వర్ణకుమారి పరిచయమైంది. కరోనా వైరస్ కు మందు ఇప్పిస్తాను అంటూ తండ్రి, బాలికను మాయ మాటలతో నమ్మించి తీసుకెళ్ళింది.. ఇక ఆ తర్వాత స్థానికంగా ఉన్న చైతన్యపురిలో బాలికను నిర్బంధించి బలవంతంగా దాడి చేసి మరీ వ్యభిచారం చేయించడం మొదలు పెట్టింది. తండ్రి ఫోన్ చేసినప్పుడల్లా కరోనా వైరస్ చికిత్స అందిస్తున్నాము అంటూ మాయ మాటలతో మభ్య పెట్టింది. విజయవాడ, హైదరాబాదు, నెల్లూరులో తెలిసిన వారికి అప్పగించి బాలికతో వ్యభిచారం చేయడం మొదలుపెట్టింది. ఇక ఇటీవల  చాకచక్యంగా బాలిక స్వర్ణకుమారి నుంచి తప్పించుకుంది. ఇక ఆ తర్వాత మరో వ్యభిచార నిర్వాహకురాలు శారద మాయమాటలతో నమ్మించి బాలికను మరొకరికి విక్రయించింది. దీంతో బాలిక అనారోగ్యానికి గురి అయింది.ఇక ఆ తర్వాత ఎలాగోలా తప్పించుకుని తండ్రి వద్దకు చేరుకుని జరిగిన విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి. ఇక పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి ఏకంగా ఇరవైఒక్క మందిని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)