ప్రకాశంలో మరో ఒమిక్రాన్​ కేసు నమోదు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరొకటి నమోదైంది.  కరోనా కేసులు స్థిరంగా ఉండగా.. ఈ సమయంలోనే ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రకాశం జిల్లాలో 52 ఏళ్ళ వ్యక్తికి ఒమిక్రాన్ ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారిలో ఈ కొత్త వేరియంట్ బయటపడింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 17కు చేరుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి బెంగళూరు మీదుగా ప్రకాశం జిల్లాకు వచ్చిన సదరు వ్యక్తికి ఒమిక్రాన్​ సోకిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అతని ప్రైమరీ కాంటాక్ట్‌లు 14మందికి టెస్ట్ నిర్వహించగా నెగెటివ్ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి కూడా ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యంగానే ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)