కూతురును చంపిన తల్లి !

Telugu Lo Computer
0


తెలంగాణలోని వరంగల్ జిల్లా పర్వతగిరికి చెందిన సమ్మక్కకు ఇద్దరు కూతురులు. పెద్దకూతురుకు పెళ్లి చేసింది. ఆ తరువాత సమ్మక్క భర్త చనిపోవడంతో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంది. చిన్న కూతురు అంజలి (17) పదవ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన రాయపురం ప్రశాంత్ తో ప్రేమలో పడింది. ఇది తెలిసి తల్లి సమ్మక్క చాలాసార్లు కూతురును మందలించింది. కూతురు తీరు మారకపోవడంతో కూతురు పెళ్లి చేసుకుంటే పరువుపోతుందని భావించిన సమ్మక్క తన తల్లి నాము యాకమ్మతో కలసి గత నెల 19న అర్థరాత్రి అంజలి నిద్రలో ఉండగా ముఖంపై దిండుపెట్టి ఊపిరి ఆడకుండాచేసి హత్య చేశారు. అనుమానాస్పద మరణం కింద పోలీసులు కేసును నమోదు చేశారు. విచారణలో భాగంగా తల్లి, అమ్మమ్మను విచారించగా కులాంతర వివాహం చేసుకుంటుందనే హత్య చేశామని ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)