వెలుగు చూస్తున్న శిల్పా చౌదరి మోసాలు

Telugu Lo Computer
0


అధిక వడ్డి ఇప్పిస్తానంటూ కొంతమంది టాలీవుడ్‌ ప్రముఖులతో పాటు నగరానికి చెందిన కొంతమంది వ్యాపార వేత్తలను మోసం చేసిన శిల్పా చౌదరి మోసాలు ఒక్కక్కటి వెలుగు చూస్తున్నాయి. ఈమె దాదాపు 100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు మోసం చేసింది. దివ్యరెడ్డి అనే మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల విచారణ అనంతరం శిల్పతో పాటు ఆమె భర్తను గత శనివారం అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. పోలీసుల రిమాండ్‌ లో వారిద్దరిని విచారణ చేశారు. రియల్‌ ఎస్టెట్‌ వ్యాపారం పేరుతో శిల్ప చాలా మందిని మోసం చేసిందని పోలీసులు వెల్లడించారు. ఆమె చేతిలో మోసపోయిన వాళ్ళు ధైర్యంగా ముందుకు  వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరిన మేరకు   ఆమె చేతిలో మోసపోయిన సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు సోదరి, యంగ్‌ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన మరి కొంతమంది ప్రముఖుల పేర్లను పోలీసులు బయటకి రానివ్వట్లేదు. తాజాగా మరో యువ హీరోని కూడా శిల్ప మోసం చేసినట్లు తెలుస్తోంది. 'సెహరి' సినిమాతో హీరోగా పరిచయమవబోతున్న హర్ష కనుమల్లి కూడా శిల్ప మాయమాటలు నమ్మి నట్టేట మునిగాడు. కిట్టి పార్టీ పేరుతో మాయ మాటలు చెప్పి శిల్ప తన దగ్గర 3 కోట్లు వసూలు చేసిందని, ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తొందంటూ ఈ యంగ్‌ హీరో పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం. పోలీసుల రిమాండ్ లో ఉన్న శిల్ప దంపతులను ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ చీటింగ్ కేసులో మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)