గుండెపోటుతో అంగన్వాడీ టీచర్ మృతి !

Telugu Lo Computer
0


తెలంగాణ లోని నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలం పాశంవారి గుడం గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్న పాశం రాజేశ్వరి భర్త చనిపోయి ఒంటరిగా ఊర్లోనే ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నది. ఈమెకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు వున్నారు. కుమారుడు కూడా రెండేళ్ల క్రితం చనిపోవడంతో కోడలు హైదరాబాద్ కి వలస వెళ్ళింది. పెళ్లిళ్లు ఆయిన ఇద్దరు కూతుళ్లు అత్తవారింటిలో వుంటున్నారు. ఈ క్రమంలో రాజేశ్వరి ఒంటరిగా ఊళ్ళోనే ఉంటుంది. గడపపై కూర్చున్న రాజేశ్వరి గుండె ఆగిపోయి అలానే గుమంపై పడి ప్రాణాలు విడిచింది. శుక్రవారం, శనివారం, ఆదివారం అంగన్వాడీ స్కూల్ కి క్రిస్మస్ సెలవులు కావడంతో రాజేశ్వరి ఇంటి వైపు ఎవ్వరు రాలేదు. నిన్న మధ్యాహ్నం ఓ అబ్బాయి రాజేశ్వరి ఇంటి వైపు వెళ్లి చూడగా రాజేశ్వరి విగతజీవిగా పడి ఉన్నది గమనించి గ్రామస్తులకు సమాచారం అందించాడు. వెంటనే గ్రామస్తులు రాజేశ్వరి బంధువులకు సమాచారం అందించారు. నిన్న సాయంత్రమే రాజేశ్వరి కి అంత్యక్రియలు నిర్వహించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)