ఆంధ్రప్రదేశ్ లో మరో 54మంది కరోనా బారినపడ్డారు. గడిచిన 24గంటల్లో 17,940 శాంపిల్స్ పరీక్షించగా.. 54మందిలో వైరస్ వెలుగుచూసినట్టు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా 121మంది కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 1099 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో వెల్లడించారు. తాజాగా నమోదైన 54 కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 19, విశాఖలో 13 చొప్పున కేసులు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,11,99,604 శాంపిల్స్ని పరీక్షించగా.. 20,76,546మందికి కరోనా పాజిటివ్గా తేలింది. వీరిలో 20,60,957మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 14,490మంది కరోనా తో చనిపోయారు.
Post a Comment
0Comments
3/related/default