గుండ్రాంపల్లి వద్ద బోల్తాపడ్డ లారీ

Telugu Lo Computer
0


విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి (ఎన్ హెచ్ 65) పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై ఓ లారీ డివైడర్‌ను ఢీకొని రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. నడిరోడ్డుపై లారీ పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ-హైదరాబాద్ మార్గంలో 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్రేన్‌ సహాయంతో లారీని తొలగించారు. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)