దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి ఎగబాకుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గించింది. దీంతో సామాన్యుడికి ఇంధన ధరల పెరుగుదల నుంచి కాస్తంత ఉపశమనం లభించింది. ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం మరింత ఊరటనిచ్చే విషయం. గత శుక్రవారం నుంచి ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించిన తరువాత పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ఒక్కసారి పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో నవంబర్ 9న లీటర్ పెట్రోల్ ధర రూ.103.97గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.86.67గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉన్నాయి.
నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు !
November 09, 2021
0