110 ఏళ్ల తర్వాత తెరచుకున్న భవనం తలుపులు

Telugu Lo Computer
0

 

అమెరికాలో ఉటా రాష్ట్రంలోని లేక్ సిటీలో నివాసముంటున్న ఓ జంట పాత ఇంటిని తక్కువ ధరకు కొనుగోలు చేశారు. దానిని రెనోవేషన్ చేసేందుకు పనులు మొదలుపెట్టగా.. వారికి అక్కడ రక్తపు మరకలతో నిండిన ఓ కార్పెట్‌ కనిపించింది. అక్కడ ఏదో తప్పు జరిగిందని గ్రహించిన ఆ జంట వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఇక అందుకు సంబంధించిన వీడియోను టిక్‌‌టాక్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఆ ఇల్లు 1911లో నిర్మించబడినది అని పోలీసుల విచారణలో తేలింది. అలాగే కార్పెట్‌పై ఉన్న రక్తపు మరకలు మనిషివా లేక జంతువువా అనే దానిపై దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అయితే దంపతులు మాత్రం ఈ భయానక సంఘటన చూసిన వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేసేశారు. కాగా, ఈ జంట ఆ దృశ్యాలను టిక్‌టాక్‌లో షేర్ చేయడంతో.. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)