తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సంస్థ ఎండీ సజ్జనార్ కోరారు. ప్రయాణికులే సంస్థకు నిధి అన్న ఆయన సంస్థను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సోషల్ మీడియా వేదికగా సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులు, ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను స్వయంగా పరిశీలించి.. వాటిని పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ప్రతి ప్రయాణీకుడు తమవంతుగా ఏమైనా సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, ఫిర్యాదులను md@tsrtc.telangana.gov.inకు పంపి సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అలాగే ట్విట్టర్ అకౌంట్ @tsrtcmdofficeను ఫాలో కావాలన్నారు.