టాలీవుడ్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఇద్దరు సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ వచ్చింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో తరుణ్కు ఎఫ్ఎస్ఎల్(ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ) క్లీన్ చిట్ ఇచ్చింది. పూరీ జగన్నాథ్, తరుణ్ నుంచి సేకరించిన రక్తం, వెంట్రుకలు, గోళ్ల శాంపిళ్లలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎస్ పరీక్షల్లో తేలింది. ఈ విషయాన్ని తెలంగాణ ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ కేసు ఛార్జిషీట్లో పేర్కొంది.