నాటి నుండి మా ఇంటికి రావడం మానేశాడు

Telugu Lo Computer
0


'సిద్ధార్థ్‌ను నేను నా కొడుకులా భావించాను. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‌ టైం నుంచి సిద్ధార్థ్‌, ప్రత్యూష మంచి స్నేహితులు. అయితే నా కూతురు చనిపోయాక సిద్ధార్థ్‌-ప్రత్యూషల గురించి మీడియాలో ఏవేవో వార్తలు రాసేవారు. దీంతో తను మా ఇంటికి రావడం మానేశాడు. కానీ నాతో ఫోన్‌లో ఎప్పుడూ టచ్‌లో ఉండేవాడు. మా బాగోగుల గురించి అడిగి తెలుసుకొనేవాడని దివంగత నటి ప్రత్యూష బెనర్జీ తండ్రి శంకర్ బెనర్జీ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ శుక్లాతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకొన్నారు.  లాక్‌డౌన్‌ సమయంలో  కూడా తరుచూ వాట్సాప్‌లో నాతో టచ్‌లో ఉండేవాడు. అంకుల్‌, ఆంటీ..మీరు బాగున్నారా? మీకు ఏదైనా సహాయం కావాలా? నేను మీకు ఏదైనా సహాయడగలనా అంటూ తరుచూ మమ్మల్ని అడిగేవాడు. వద్దన్నా బలవంతంగా ప్రతీ నెల 20వేల రూపాయలు పంపేవాడు. అతని మరణం సడెన్‌ షాక్‌లా అనిపిస్తుంది' అంటూ సిద్ధార్థ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)