భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంపు డ్యూటీని ఇటీవలే పెం చిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజలపై దొడ్డిదారిన మరో భారాన్ని మోపింది. క్రయవిక్రయ లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్ ఫీజులు, యూజర్ చార్జీలను అడ్డగోలుగా పెంచింది. ఇప్పటివరకు ఉన్న ఫీజులు, చార్జీలను రెండింతల నుంచి పదింతలు చేసింది. ఈ నెల రెండో తేదీ నుంచే పెంపును అమల్లోకి తెస్తూ స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషాద్రి ఇటీవల అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు.
డాక్యుమెంట్, యూజర్ చార్జీల పెంపు తీరు ఇదీ.. (రూ.లలో)
డాక్యుమెంట్ రకం గత చార్జీ పెంచిన చార్జీ
ర్యాటిఫికేషన్ 1,000 2,000
మార్టిగేజ్ 2,000 2,000
ఎస్పీఏ 1,000 3,000
జీపీఏ 1,000 5,000
ప్రైవేట్ అటెండెన్స్ 1,000 10,000
వీలునామా 1,000 3,000
వీలునామా విచారణ 1,000 5,000
రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 100 500
15 పేజీలు దాటితే పేజీకి రూ.ఐదు 1,000
మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ 10 100
సర్టిఫైడ్కాపీ 200 500
ఈసీ 100 500
30 ఏళ్లు దాటిన ఈసీ 500 1,000
(ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొనని ప్రతిరకం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఫీజును రూ.3,000గా ఖరారు చేశారు)